అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చేబ్రోలు స్టేషన్ సమీపంలో చర్లపల్లి-షాలిమార్ రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ యువకుడు ఉన్నారు. శనివారం (జులై 4) రాత్రి ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నలుగురి మృతికి ఆత్మహత్య లేదా ప్రమాదమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లోని ఓ మహిళ దగ్గర షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే, ఘటన స్థలంలో రెండు సెల్ ఫోన్లు, తాడేపల్లి ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు లభ్యమైంది.
