పదికోట్లు పూచికత్తు.. జైలు నుంచి విడుదల కానున్న శశికళ

పదికోట్లు పూచికత్తు.. జైలు నుంచి విడుదల కానున్న శశికళ

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. 2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించింది. జైలు శిక్ష నిమిత్తం  2022 ఫిబ్రవరి 27 వరకు జైలులో శిక్షను అనుభవించాల్సి ఉండగా..సత్ర్పవర్తన కారణంగా  శశికళ జనవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను చెల్లించారు. మరోవైపు వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ విడుదలతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.