ఓటర్లను మరింత చైతన్యపర్చాలి: వికాస్ రాజ్

ఓటర్లను మరింత  చైతన్యపర్చాలి: వికాస్ రాజ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్తలుగా నియమితులైన ప్రముఖులతో సీఈఓ వికాస్ రాజ్  ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటిదాకా ఓటర్లు తమ పేర్లను తనిఖీ చేసుకుని తగు మార్పులుచేర్పులను చేసుకునేలా,  ఎక్కువమంది కొత్త ఓటర్లుగా నమోదయ్యేలా  చైతన్య పరచడం జరిగిందన్నారు.  నోటిఫికేషన్  తరువాత ఎక్కువ మంది ఓటు హక్కును ఉపయోగించుకునేలా  చైతన్యపరచాల్సి ఉంటుందని  సూచించారు. 

ఈ సమావేశానికి హాజరైన వారిలో ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ లో 2015 సంవత్సరం అర్జున్ అవార్డు గ్రహీత అనూప్ కుమార్, అంతర్జాతీయ క్రికెటర్ మహేందర్ వైష్ణవ్, టీవీ ప్రజెంటర్ జాత, జాతీయ పడవ పందాల క్రీడాకారుడు చరణ్ సింగ్ షెకావత్, భారత విలువిద్య  క్రీడల కోచ్, ప్రెసిడెంట్ అవార్డ్ గ్రహీత డా. పి.రవిశంకర్, తెలంగాణ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా తదితరులు పాల్గొన్నారు.