25 నుంచి వీఆర్వోల విధుల బహిష్కరణ

25 నుంచి వీఆర్వోల విధుల బహిష్కరణ

ఈ నెల 25 నుంచి వీఆర్వోలు విధులను బహిష్కరించాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్ లోని వాసవి భవన్ లో రాష్ట్ర విలేజ్ రెవెన్యూ అఫిసర్స్ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. వీఆర్వోల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ సమస్యల పరిష్కరించాలని ఈ నెల 23న భూపరిపాలన కమిషనర్ కు వినతి పత్రం అందిస్తామన్నారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5485 మంది వీఆర్వోలు అన్ని రకాల విధులను బహిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని గోల్కొండ సతీష్ హెచ్చరించారు.