న్యూఢిల్లీ: భారత కోస్ట్ గార్డ్ చీఫ్ గా వీఎస్ పఠానియా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 24వ చీఫ్ గా నియమితులైన పఠానియా.. ఇప్పటి వరకు కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అదనపు డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహించారు. వీరేందర్ సింగ్ పఠానియా గత మూడున్నర దశాబ్ధాలుగా సంస్థకు వివిధ పనుల్లో సేవలందించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన కోస్ట్ గార్డు గౌరవ వందనం స్వీకరించారు.