ఇయర్​ ఫోన్స్​పెట్టుకుని పట్టాలపై వాకింగ్​ రైలు ఢీకొని తెగిపడిన చెయ్యి

ఇయర్​ ఫోన్స్​పెట్టుకుని పట్టాలపై వాకింగ్​ రైలు ఢీకొని తెగిపడిన చెయ్యి

మక్తల్, వెలుగు : చెవుల్లో ఇయర్​ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పట్టాలపై వాకింగ్​ చేస్తుండగా రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి చెయ్యి తెగిపోయింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్  రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. పట్టణానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి ఉదయం వాకింగ్ కు వెళ్లాడు. రైలు పట్టాలపై ఇయిర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నడుస్తుండగా వెనక నుంచి వచ్చిన గూడ్స్  రైలు ఢీ కొట్టింది. 

ఫుల్​వాల్యూమ్​తో ఇయర్ ​ఫోన్స్​లో పాటలు వింటుండడంతో రైలు శబ్దం ​వినిపించలేదు. దీంతో ప్రమాదం జరిగి ఎడమ చేయి తెగి పట్టాల మధ్యలో పడింది. స్థానికులు నవీన్​ను మక్తల్  ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ ఫస్ట్​ ఎయిడ్ ​చేసి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు.