ఆ రోజులు మళ్లీ వచ్చినట్టుంది : చిరంజీవి

ఆ రోజులు మళ్లీ వచ్చినట్టుంది : చిరంజీవి

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు వేడుకని చూస్తుంటే చరిత్రని తిరగరాసినట్లుగా అనిపించింది అన్నారు  చిరంజీవి. బాబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. చిరంజీవి, రవితేజ పాల్గొన్న ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సాన హాజరయ్యారు.

 చిరంజీవి మాట్లాడుతూ ‘ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు.. సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో  ‘వాల్తేరు వీరయ్య’  200 రోజులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉంది. ఈ విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరూ కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ అలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది.

 ఇందులో పనిచేసిన టీమ్ అందరికీ నా అభినందనలు’ అన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు రవితేజ. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని దర్శక నిర్మాతలు చెప్పారు.