వరంగల్ ఎయిర్‌‌పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలి : షీప్ ఫెడరేషన్ చైర్మన్ చరణ్‌‌

వరంగల్ ఎయిర్‌‌పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలి : షీప్ ఫెడరేషన్ చైర్మన్ చరణ్‌‌
  •     కిషన్‌‌రెడ్డికి షీప్ ఫెడరేషన్ చైర్మన్ ​చరణ్‌‌ వినతి

హైదరాబాద్‌‌, వెలుగు: వరంగల్‌‌ (మామునూరు) విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డిని షీప్​ఫెడరేషన్​చైర్మన్ డాక్టర్‌‌ చరణ్‌‌ కౌశిక్‌‌ యాదవ్‌‌ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కిషన్‌‌ రెడ్డికి లెటర్​ రాశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం పాలన, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమరయ్య త్యాగాన్ని శాశ్వతంగా గుర్తించేలా మామునూరు విమానాశ్రయానికి ‘అమరవీరుడు దొడ్డి కొమరయ్య విమానాశ్రయం’గా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ ప్రతిపాదనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.కొమరయ్య జన్మభూమి, పోరాట ప్రాంతమైన వరంగల్‌‌ ప్రాంతానికి ఈ నామకరణం చారిత్రక గుర్తింపునివ్వడంతో పాటు ఆయన త్యాగానికి ఘన నివాళిగా నిలుస్తుందని చరణ్‌‌ కౌశిక్‌‌ పేర్కొన్నారు.