మెదడు షార్ప్గా, చురుగ్గా పనిచేయాలంటే మనం తినే తిండి చాలా ముఖ్యం. ఎయిమ్స్, హార్వర్డ్ వంటి ప్రముఖ సంస్థల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (జీర్ణకోశ నిపుణులు) డాక్టర్ మెదడు ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన 5 ఆహారాలను సూచించారు. అవేంటో చూద్దామా.....
వాల్నట్లు (అక్రోట్లు): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఒత్తిడి, వాపుల నుంచి కాపాడి జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
గుడ్లు: గుడ్లలో ప్రొటీన్తో పాటు 'కోలిన్' అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులో జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి అవసరమైన 'ఎసిటైల్కోలిన్' అనే రసాయనం తయారవడానికి చాలా అవసరం.
కొవ్వు చేపలు (సాల్మన్ ఫిష్ వంటివి): వీటిలో DHA, EPA రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా DHA అనేది మెదడు కణాల నిర్మాణానికి, నరాల పనితీరు మెరుగ్గా ఉండటానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
గుమ్మడి గింజలు: వీటిలో మెగ్నీషియం, జింక్, రాగి (కాపర్) ఉంటాయి. జింక్ నరాల మధ్య సంకేతాలు సరిగ్గా అందేలా చూస్తే, మెగ్నీషియం నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసి మానసిక చురుకుదనం ఉండేలా సహకరిస్తుంది.
ALSO READ : అడవిలో జింక, ఎద్దుల నిజమైన స్నేహం.. ప్రాణం తీయబోయిన నక్క..
బెర్రీలు: వీటిలో ఉండే పాలిఫెనాల్స్, ఆంథోసయనిన్లు మెదడులో వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా, వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి మందగించే సమస్యను ఇవి చాలా వరకు నెమ్మదింపజేస్తాయి.
ఈ ఐదు ఆహారాలను మన ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే మెదడు చురుగ్గా మారడంతో పాటు జ్ఞాపకశక్తి, నరాల ఆరోగ్యం కూడా మెరుగవుతాయి.
