హాసన్ పర్తి, వెలుగు : పెండింగ్ చాలన్లపై డిస్కౌంట్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని . అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్లు నమ్మవద్దని వరంగల్, హనుమకొండ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై బుధవారం నాడు ప్రకటన విడుదల చేశారు.
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ల గురించి ఉన్నతాధికారుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పారు అలాగే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని హెచ్చరించారు.
