సైప్రస్‎లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

సైప్రస్‎లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సైప్రస్‌‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. రెండు రోజుల పాటు సైప్రస్‌‌లో వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, టెక్నాలజీ, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొంటారు.

 అనంతరం ఆయన జూన్ 18న క్రొయేషియా వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్, ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్‌‌లతో సమావేశమవుతారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు తెలపడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రధాని ఈ మూడు దేశాల పర్యటన చేపట్టారు.