ఉగ్రవాది కసబ్ను ఉంచిన సెల్ లోనే ఉంచారు.. జైలు జీవితంపై బాలీవుడ్ నటుడి కన్నీటి గాథ

ఉగ్రవాది కసబ్ను ఉంచిన సెల్ లోనే ఉంచారు.. జైలు జీవితంపై బాలీవుడ్ నటుడి కన్నీటి గాథ

జీవితం అంటే ఏంటో తెలియదు.. ప్రపంచం అంటే అవగాహన లేదు.. 21 ఏళ్ల వయసులో జైల్లో చీకటి గదిలో బంధించారు. ముంబై ఉగ్రదాడికి పాల్పడిన కసబ్ ను ఉంచిన సెల్ లో ఉంచారు.. బాంబులు పేల్చిన వ్యక్తిని చూసినట్లు ట్రీట్ చేశారు.. ఇది బాలీవుడ్ యువ నటుడు సూరజ్ పంచోలీ తన జైలు జీవితంపై చెప్పిన కన్నీటి గాథ.

2013 నాటి జియా ఖాన్ సూసైడ్ కేసు.. తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఓ ఇంటిర్యూలో చెప్పాడు సూరజ్.ఈ కేసు తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని.. ఫ్యామిలీ మెంబర్స్ కళ్లలోకి కూడా చూడలేని పరిస్థితుల్లో గడిపానని తెలిపాడు. వాస్తవానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినపుడు కుటుంబం అంతా దగ్గరవుతుంది.. కానీ నా జీవితంలో ఆ సమయంలో దగ్గరకాలేకపోయామని.. ఇప్పుడు ఆ సమస్య లేదని చెప్పుకొచ్చాడు. 

ఈ కేసులో జైలుకెళ్లిన తర్వాత.. దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు సూరజ్ చెప్పాడు. తనను చీకటి గదిలో బంధించారని.. కనీసం దిండు కూడా ఇవ్వలేదని చెప్పాడు. తన స్టోరీ రాసిన న్యూస్ పేపర్స్ పైనే పడుకున్నట్లు తాను పడుకోవాల్సి వచ్చిందని అన్నాడు. 

జియా ఖాన్ కేసు:

నిశబ్ద్, గజినీ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి జియాఖాన్ 2013, జూన్ 3న ముంబైలోని తన ఇంట్లో ఆమె అమ్మ చేతిలో హత్యకు గురైంది. అయితే అప్పుడు జియా ఖాన్న బాయ్ ఫ్రెండ్ అయిన సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్టు చేశారు. జియా సూసైడ్ చేసుకోవడంలో సూరజ్ పాత్ర ఉందని అప్పట్లో పోలీసులు అనుమానించారు. 

ALSO READ | Spirit: రూ.20 కోట్లు డిమాండ్‌ చేసిన దీపికా.. త్రిప్తికి ఐదింతలు తక్కువే ఇస్తున్న సందీప్ రెడ్డి వంగా!

జియా ఆరుపేజీల సూసైడ్ నోట్ లో సూరజ్ తో ఉన్న సంబంధం.. ఫిజికల్ గా టార్చర్ చేశాడని.. అందుకే సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొనడంతో అరెస్టు చేశారు. అయితే జియా ఖాన్ సూసైడ్ కు సూరజ్ కు సంబంధం లేదని 2023 లో నిర్దోషిగా విడుదలయ్యాడు. సూరజ్ ప్రముఖ నటులు ఆదిత్య పంచోలీ, జరీనా వాహబ్ ల కుమారుడు. 

ఆ తర్వాత అన్నింటి నుంచి బయటపడిన సూరజ్.. తాజాగా నటిస్తున్న చిత్రం ‘కేసరి వీర్’. ప్రిన్స్ దామిన్ డైరెక్ట్ చేస్తున్నారు. సునిల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, బర్ఖా బిస్త్, అరుణ ఇరానీ.. తదితర పెద్ద పెద్ద నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.