ఏసీబీకి పట్టుబడిన వాటర్ బోర్డు మేనేజర్

ఏసీబీకి పట్టుబడిన వాటర్ బోర్డు మేనేజర్

హైదరాబాద్,వెలుగు : లంచం తీసుకుంటూ వాటర్ బోర్డ్‌‌  మేనేజర్‌‌‌‌ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన ప్రకారం.. అంబర్‌‌‌‌పేట్‌‌ ఎంసీహెచ్‌‌ కాలనీకి చెందిన బండి కేశవ్‌‌ తన తల్లి పేరు వాటర్ రికార్డ్స్‌‌లో తప్పుగా పడింది.

పేరును సరి చేయించేందుకు స్థానిక వాటర్‌‌ వర్క్స్‌‌ మేనేజర్‌‌ యాదగిరి రెడ్డిని సంప్రదించాడు. ఇందుకోసం యాదగిరిరెడ్డి రూ.10 వేలు లంచం డిమాండ్‌‌ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శనివారం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.