హైదరాబాద్సిటీ, వెలుగు: జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని నవీన్ నగర్ కాలనీ, ఆనంద్నగర్ ప్రాంతాల్లో సీవరేజీ సమస్యలను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక డీ-సిల్టింగ్ చేపట్టాలని ఆదేశించారు. తరచూ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్హోల్స్ను గుర్తించి రెడ్ మార్క్ వేయాలన్నారు. కాగా, అధికారుల పరిశీలనలో 15 ఏండ్ల కింద నిర్మించిన ఒక డీప్ మ్యాన్హోల్ దెబ్బతిన్నట్లు గుర్తించి, సమస్య పరిష్కారానికి ఆదేశించారు. ఆపరేషన్ డైరెక్టర్ ప్రభు పాల్గొన్నారు.
నీటిని వృథా చేస్తున్న వ్యక్తికి ఫైన్
ఖైరతాబాద్ పరిధిలో ఎండీ అశోక్ రెడ్డి విజిట్చేస్తుండగా ఆనంద్ నగర్ కాలనీలో ఓ ఇంటిలో సంప్, ఓవర్హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో కారణంగా తాగునీటి వృథా జరుగుతున్నదని గుర్తించారు. వెంటనే నోటీసు ఇచ్చి, రూ.10 వేల జరిమానా విధించారు.
