
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యూరీఫైడ్ వాటర్ సెంటర్లను సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎన్.వాణి శుక్రవారం ప్రారంభించారు. హాస్పిటల్కు వచ్చే వారికి ఉచితంగా ఫిల్టర్ వాటర్ను అందించడంపై మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.
ఇప్పటి వరకు వంద లీటర్ల కెమెసిటీ కలిగిన 20 యూనిట్లు, 300 లీటర్ల కెపాసిటీ కలిగిన 4 యూనిట్లు, డాక్టర్లకు 12 లీటర్ల కెపాసిటీ కలిగిన 25 ఆర్వో యూనిట్లను ఏర్పాటు చేశామని, మరో 25 ఆర్వో యూనిట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ చైర్మన్ మంచుకొండ వరుణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రవన్, సిబ్బంది మల్లేశం, సతీశ్ పాల్గొన్నారు.