
హైదరాబాద్, వెలుగు: పటాన్చెరులోని మంజీరా ఫేజ్–1 పైప్లైన్ వాల్వ్ జంక్షన్ వద్ద రిపేర్లు కారణంగా బుధవారం సిటీలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు వాటర్బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, హెచ్ సీయూ, పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరు, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట, డోయెన్స్ కాలనీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు.