హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇవాళ వాటర్ ​సప్లయ్​ బంద్

హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇవాళ వాటర్ ​సప్లయ్​ బంద్

హైదరాబాద్, వెలుగు: పటాన్​చెరులోని మంజీరా ఫేజ్–1 పైప్​లైన్​ వాల్వ్ జంక్షన్ వద్ద రిపేర్లు కారణంగా బుధవారం సిటీలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, హెచ్ సీయూ, పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్ చెరు, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట, డోయెన్స్ కాలనీ, ఎస్​బీఐ ట్రైనింగ్ సెంటర్​తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు.