9వేల కోట్లతో 26వేల స్కూళ్లలో సౌకర్యాలు 

 9వేల కోట్లతో 26వేల స్కూళ్లలో సౌకర్యాలు 
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన పాఠశాలలకు ఇవాళ తొలిరోజు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లను కార్పొరేట్ కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 26 వేల స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు. 
ఈ ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం

సర్కార్ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం మొదలు పెట్టామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని ఆమె చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకులాలల్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. బడిబాట కార్యక్రమనికి మంచి స్పందన లభించిందన్నారు. 
లోపాలు వెతికే ప్రయత్నం చేయవద్దు 


ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని.. మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతియేడు మాదిరిగా ఈ విద్యా సంవత్సరంలో జులై మొదటి వారంలోపు పుస్తకాలు, రెండో వారంలో యూనిఫార్మ్స్ అందిస్తామని మంత్రి వివరించారు.