- పటాన్చెరులో ఏడున్నర కోట్లతో నిర్మించిన స్టేడియం బాగుంది..
- రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ కడుతాం..
- స్టేడియం ప్రారంభంలో మంత్రి హరీశ్రావు
పటాన్చెరు, వెలుగు : గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి హరీశ్రావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరిలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కొత్తగా రూ.3 కోట్ల 85 లక్షలతో అభివృద్ధి చేసిన మైత్రి క్రీడా ప్రాంగణాన్ని, రూ.3 కోట్ల 40 లక్షలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో కరూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడున్నర కోట్ల తో స్టేడియం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం గ్రామాల్లోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వబోతోందని తెలిపారు. అలాగే పటాన్చెరు పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ.300కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రొటైం చైర్మన్ భూపాల్రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి