- ఐడీహెచ్ కాలనీలో హౌసింగ్ ఎండీ, బల్దియా బాస్, కలెక్టర్ హరిచందన పరిశీలన
- త్వరలో ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్ నగర్ లోని ఐడీహెచ్ డబుల్ బెడ్రూమ్కాలనీలో ఇండ్లను మంగళవారం హౌసింగ్శాఖ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ పరిశీలించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ డబుల్ బెడ్రూమ్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ హరిచందన దాసరి, బల్దియా కమిషనర్కర్ణన్విజిట్చేశారు. నాలుగు బ్లాకులను చూడగా అందులో చాలామటుకు గోడలు బీటలు వారి, స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హౌసింగ్ఎండీ గౌతమ్తెలిపారు.
తర్వాత అధికారులు అంగన్వాడీ కేంద్రం, గాంధీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మారేడ్పల్లి అంబేద్కర్ కాలనీలో పేదల ఇండ్లను పరిశీలించి సమస్యలడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆర్ పుష్పలత, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ పాల్గొన్నారు.
