అసదుద్దీన్ని ఓడిస్తం.. 17 సీట్లు గెలుస్తం : కిషన్ రెడ్డి

 అసదుద్దీన్ని ఓడిస్తం.. 17  సీట్లు గెలుస్తం : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ పై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో  బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవకున్న నష్టం లేదన్నారయన. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని చెప్పారు. తూప్రాన్ లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కిషన్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ని ఒడిస్తామన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్ళిపోతారని కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తే  వృథా అయినట్టే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా రేవంత్ రెడ్డికి లేదన్నారాయన. ఇంకో రేండు నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాయకులను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు.