పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు  చేయిస్తాం

పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు  చేయిస్తాం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

కుషాయిగూడ, వెలుగు: పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు  చేయిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం చర్లపల్లి డివిజన్​ఇందిరమ్మ కాలనీలో పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 10న పుష్పగిరి కంటి ఆస్పత్రి వారి సహకారంతో మారేడ్ పల్లిలో ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ సెల్ పబ్లిసిటీ కన్వీనర్ కొమ్ము నర్సింగ్ రావు, డివిజన్ ప్రెసిడెంట్ నాదం, సీనియర్ నాయకుడు కొల్లోజి భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.