పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పొరుగు దేశానికి పారిపోయేందుకు ప్రయత్నించే వారిని హతమార్చేందుకు భారత్ పాకిస్థాన్లోకి ప్రవేశిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ దేశ గడ్డపై బెదిరింపులను తొలగించే వ్యూహంలో భాగంగా 2020 నుండి పాకిస్థాన్లో కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చారని వారు పాకిస్తాన్కు పారిపోతే, వారిని చంపడానికి తాము పాకిస్తాన్లోకి ప్రవేశిస్తామని తెలిపారు.
భారతదేశం ఎప్పుడూ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని కానీ ఎవరైనా భారత్కు పదే పదే కోపం చూపిస్తూ, ఈ దేశానికి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తే తాము వారిని విడిచిపెట్టమని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.