రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా ? మంత్రి సురేఖపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం: బీసీ నేతలు

రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా ? మంత్రి సురేఖపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం: బీసీ నేతలు

బషీర్‌బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ షోకాజ్‌నోటీసులు ఇవ్వడం అన్యాయమని బీసీ నేతలు నీరజాగౌడ్, కటకం నర్సింగ్‌రావు, కె.యాదవ్, ఎన్‌.చిన్నరాములు ముదిరాజ్, బొంగు ప్రసాద్‌గౌడ్‌ అన్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. కాంగ్రెస్​లో రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా ఇతర నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్​చేశారు.