కాబూల్: ఇండియాతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్కు అప్పగించారు. ఈ సిరీస్ కోసం మొత్తం 15 మందితో కూడిన జట్టును అఫ్గాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13, 15, 17న మూడు టీ20లు జరగనున్నాయి.
జట్టు వివరాలు:
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రెహమానుల్లా గుర్బాజ్, నూర్ రెహమాన్, సెడిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోతి, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్ హక్ ఫారూకీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, నవీన్-ఉల్-హక్. రిజర్వ్లు: ఇజాజ్ అహ్మద్జాయ్, షాహిదుల్లా కమల్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
