స్టేషన్​ఘన్ పూర్​లో కోర్టును ప్రారంభిస్తాం .. జడ్జి రవీంద్రశర్మ

స్టేషన్​ఘన్ పూర్​లో కోర్టును ప్రారంభిస్తాం .. జడ్జి రవీంద్రశర్మ

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు :  ప్రజల ముంగిట్లోకి న్యాయసేవలు అందించేందుకు కృషి చేస్తామని జనగామ జిల్లా ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ అండ్​ సెషన్స్​ జడ్జి రవీంద్రశర్మ అన్నారు.  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ డివిజన్​ కేంద్రానికి కొన్ని నెలల కిందట మంజూరైన ఫస్ట్ క్లాస్​ జూనియర్​ సివిల్​ జడ్జి కోర్టును స్థానిక బస్టాండ్​ సమీపంలోని తిరుమలనాథస్వామి దేవాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ బిల్డింగ్​లో ఏర్పాటు చేస్తున్నారు.

 గురువారం ఈ భవనాన్ని జనగామ జిల్లా ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ అండ్​ సెషన్స్​జడ్జి రవీంద్రశర్మ సందర్శించారు.  కోర్టు ఏర్పాటు కోసం కావాల్సిన వసతులను పరిశీలించి, ఆర్డీవో డీఎస్​ వెంకన్న, ఆర్​అండ్​బీ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్టేషన్​ఘన్​పూర్​లో త్వరలో కోర్టును ప్రారంభిస్తామన్నారు. ఈ కోర్టు ఏర్పాటుతో స్టేషన్​ఘన్​పూర్​, చిల్పూరు, జఫర్​గఢ్, పాలకుర్తి, కొడకండ్ల మండలాల ప్రజలకు న్యాయ సేవలు అందుబాలోకి వస్తాయన్నారు.

సీనియర్​ సివిల్​ జడ్జి విక్రమ్, అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ ప్రభాకర్, సీనియర్​ సూపరింటెండెంట్​ఎండీ రహీమొద్దీన్, తహసీల్దార్​ వెంకటేశ్వర్లు, స్టేట్​ బార్​ కౌన్సిల్​ మెంబర్​ దుస్స జనార్దన్, స్టేషన్​ఘన్​పూర్​ బార్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ కనకం రమేశ్, జనరల్​ సెక్రటరీ పిల్లి కార్తీర్, కోశాధికారి గద్దె అనిల్, నీరటి కార్తీక్, పిట్టల కమలాకర్​పాల్గొన్నారు.  సీఐ ముసికె రాజు, ఎస్సై వినయ్​కుమార్​ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.