గ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

గ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

గ్రామాలలో నివసించే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్  న్యూస్ చప్పింది. ఇక నుంచి గ్రామ స్థాయిలో వాతావరణ అంచనాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఐఎండీ 150వ వార్షికోత్సవం సందర్భంగా 15 వ తేదీ సోమవారం నుంచి 'ప్రతి చోట వాతావరణం..ఇంటింటికీ వాతావరణం పేరుతో' ఈ సేవలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. 

ఓ మొబైల్ యాప్ ద్వారా వాతావరణ మార్పులు, వర్షాలు, ఎండలు, పిడుగుల సమాచారం అందించనుంది. దీంతో గ్రామాల ప్రజలకు మేలు జరగనుంది. ఇంటి నుంచి వెళ్లినప్పుడు వాతావరణం చెక్ చేసుకొని వెళ్తే ప్రమాదాలు తప్పుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.