గ్రామాలలో నివసించే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చప్పింది. ఇక నుంచి గ్రామ స్థాయిలో వాతావరణ అంచనాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఐఎండీ 150వ వార్షికోత్సవం సందర్భంగా 15 వ తేదీ సోమవారం నుంచి 'ప్రతి చోట వాతావరణం..ఇంటింటికీ వాతావరణం పేరుతో' ఈ సేవలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
ఓ మొబైల్ యాప్ ద్వారా వాతావరణ మార్పులు, వర్షాలు, ఎండలు, పిడుగుల సమాచారం అందించనుంది. దీంతో గ్రామాల ప్రజలకు మేలు జరగనుంది. ఇంటి నుంచి వెళ్లినప్పుడు వాతావరణం చెక్ చేసుకొని వెళ్తే ప్రమాదాలు తప్పుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.