అనంత‌పురం జిల్లాలో 21 నుంచి లాక్ డౌన్

అనంత‌పురం జిల్లాలో 21 నుంచి లాక్ డౌన్

అనంత‌పురం జిల్లాలో జూన్- 21 నుంచి వారం రోజులు పాటు లాక్ డౌన్ విధించనున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్ర‌మంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తామ‌న్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంద‌న్నారు.

ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని సూచించారు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయని.. హోటల్స్ లో ఆన్ లైన్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే పార్సిల్ ఇవ్వాల‌న్నారు. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తిస్థాయిలో బంద్ చేయాల‌న్నారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.