ఆరోపణలు చేసిన వారికి పరువునష్టం నోటీసులు ఇస్తా

ఆరోపణలు చేసిన వారికి పరువునష్టం నోటీసులు ఇస్తా

మాజీ కాంగ్రెస్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కమ్ ఠాగూర్. కేసీఆర్ కు విధేయులుగా ఉన్న కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారంటూ ట్వీట్ చేశారు ఠాగూర్. TRS ను ఓడించి..కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లాయర్లు పరువునష్టం నోటీసులు ఇస్తారని ట్వీట్ చేశారు. మధురైలో కేసు కూడా నమోదు చేస్తానని చెప్పారు. వెల్ కమ్ టూ మధురై కోర్టు అంటూ ట్వీట్ చేశారు ఠాగూర్. రేవంత్ రెడ్డి మాణిక్కమ్ ఠాగూర్ కు  రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి.