నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో తమ పార్టీ బలగం ఎంతుందో తేల్చే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న ఆ పార్టీ నేతలు ఫీల్డ్లెవెల్లో తమకు ఎంతమంది ఓటర్ల మద్దుతుందో తెలుసుకునేందుకు ‘ఓటర్మ్యాపింగ్’ పేరుతో అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపడుతున్నారు. దీనిని సక్సెస్చేసేందుకు పక్క రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లీడర్లను రంగంలోకి దింపారు. దీని కోసం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఇన్చార్జిని నియమించారు. ప్రస్తుతం వారు పార్లమెంట్సెగ్మెంట్పరిధిలోని జిల్లా కేంద్రంలో ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్లెవెల్ఏజెంట్లతో సమావేశాలు పెడ్తున్నారు. పార్టీ సీనియర్లున్న చోట వాళ్లే స్వయంగా మీటింగులు నిర్వహిస్తున్నారు.
పార్టీల వారీగా ఓటర్ల గుర్తింపు
నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్ప్రకటించిన బూత్ల ప్రకారం కాంగ్రెస్పార్టీ నుంచి ఏజెంట్లను నియమించారు. ప్రతి గ్రామంలో 150 నుంచి 200 ఇండ్ల వరకు ఒక బీఎల్ఓను పెట్టారు. గ్రామశాఖ అధ్యక్షుడు, బీఎల్ఓ కలిసి ఇంటింటికి తిరిగి మూడు కేటగిరీల్లో ఓటర్లను గుర్తిస్తారు. ఒక ఇంటిలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లుంటే ఆ జాబితాలో వాళ్ల పేర్ల పక్కన కాంగ్రెస్ (సీ) అని గుర్తిస్తారు. బీఆర్ఎస్అయితే (బీ) అని, తటస్థంగా (న్యూట్రల్) ఉన్న ఓటర్లను (ఎన్) అని పేర్కొంటారు. ఈ రకంగా ప్రతి బూత్లెవెల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఎంత మంది ఉన్నారనే లెక్క గడతారు. దీంతోపాటే మొబైల్ఫోన్నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ఆధారంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు పెడుతుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని అనుకుంటున్నారు. పాంప్లెంట్స్, ప్రకటన రూపంలో కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి, బీఆర్ఎస్ వైఫల్యాలపైన సెల్ఫోన్లకు మెసేజ్లు పంపి ప్రచారం చేయడానికి ఈ ఓటరు లిస్ట్దోహదపడుతుందని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్లాన్కు దీటుగా...
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్బలంగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు చెబుతుండడంతో గట్టెక్కేందుకు ఆ పార్టీసంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందిన వారి నంబర్లు తీసుకున్న ఆ పార్టీ నేతలు ఎన్నికల టైంలో మేసేజ్లు పంపించి ప్రచారం చేయాలని ప్లాన్చేస్తున్నారు. అయితే దీన్ని తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వీలైనంత ఎక్కువమంది ఓటర్లకు కనెక్ట్ కావాలని చూస్తోంది. తమను అధికారంలోకి తీసుకువస్తే బీఆర్ఎస్ కంటే అద్భుతంగా ఏం చేయగలుగుతామో చెబుతూ తమ వైపు తిప్పుకునే ఆలోచన చేసినట్టు
తెలుస్తోంది.
తేల్చడం సులువేనా?
2014లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. తొమ్మిదేండ్లు పాలనకు దూరమైంది. ఇన్నేండ్లలో కాంగ్రెస్ కేడర్ చెల్లాచెదురైంది. పార్టీ లాయలిస్టులు మాత్రమే మిగిలారు. ఓటర్ మ్యాపింగ్ చేయడానికి అన్ని చోట్లా పార్టీ కేడర్ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న కోదాడ, హుజూర్నగర్లలో ఓటర్ మ్యాపింగ్నడుస్తోంది. పీసీసీ మాజీ చీఫ్ఉత్తమ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం శ్రమిస్తున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో ఇన్చార్జీగా వచ్చిన కర్నాటక ఎమ్మెల్యే మానె శ్రీనివాస్సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ఇన్చార్జీగా కర్నాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే అజయ్ సింగ్ను నియమించారు. ఆయన త్వరలోనే మీటింగులు మొదలుపెట్టనున్నట్టు తెలిసింది. అయితే, ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసుకున్న వాళ్లు దీనిపై ఆసక్తి చూపకపోవడం మైనస్అవుతోంది. అభ్యర్థిత్వాన్ని తేల్చాకే ఓటర్ మ్యాపింగ్చేస్తామని చెప్తుండడంతో పార్టీ సీనియర్లీడర్లు ఆల్టర్నేట్దారులు వెతుకుతున్నారు.