ఓటు బ్యాంక్ కోసమే ఆర్టికల్ 370ని ప్రస్తావిస్తున్నారు

ఓటు బ్యాంక్ కోసమే ఆర్టికల్ 370ని ప్రస్తావిస్తున్నారు

న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ముఖ్యంగా మోడీ తన స్పీచ్‌‌లో ఆర్టికల్ 370 ప్రస్తావన తీసుకురావడంపై మెహబూబా ఫైర్ అయ్యారు. ఓటు బ్యాంక్ కోసమే బిహార్‌‌లో మోడీ ఆర్టికల్ 370 ప్రస్తావనను తీసుకొచ్చారని ఆమె ఫైర్ అయ్యారు.

‘బిహార్‌‌లో ఓటు బ్యాంక్ కోసం ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ ఆశ్రయించారు. ఎందుకంటే నిజమైన సమస్యల జోలికి వాళ్లు వెళ్లాలనుకోవడం లేదు, ఆ సమస్యలను పరిష్కరించాలని వాళ్లు భావించడం లేదు. ఎప్పుడైతే వాస్తవ సమస్యల విషయంలో విఫలమవుతారో అప్పుడే కశ్మీర్, ఆర్టికల్ 370 లాంటి వాటి ప్రస్తావన తీసుకొస్తారు’ అని మెహబూబా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి మెహబూబా మాట్లాడుతూ.. దొంగ ఎప్పటికైనా తాను దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చేయాలనేదే కశ్మీర్ ప్రజలకు తాను చెప్పదల్చుకున్నానని చెప్పారు.