భారత్,దక్షిణ కొరియా వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన WHO

భారత్,దక్షిణ కొరియా వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన WHO

వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) లేటెస్టుగా రెండు కరోనా టీకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా.. రెండోది దక్షిణ కొరియాకు చెందిన SK బయో కంపెనీ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా. ఈ రెండింటి వినియోగానికి WHO గ్రీన్ సిగ్నలిచ్చింది. కోవ్యాక్స్ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ రెండు టీకాలకు అనుమతి ఇవ్వడంతో కోవ్యాక్స్ ప్రోగ్రాం తరపున ప్రపంచ దేశాలకు టీకా అందించేందుకు మార్గం ఈజీ అయ్యిందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు కోవ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

భారత్ వివిధ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 20 దేశాలకు కోటీ 62 లక్షలకుపైగా కరోనా టీకా డోసులను అందించింది.