స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయట్లే? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

స్వామినాథన్  సిఫార్సులు ఎందుకు అమలు చేయట్లే? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు :  ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.  కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవినాశ్​రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్ ఎల్ బీ స్టేడియం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు  సంఘీభావ ర్యాలీ తీశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్ కు భారతరత్న అవార్డ్ ప్రకటించిన మోదీ ప్రభుత్వం.. ఆయన సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలకు వేల కోట్లు మాఫీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతు ఉద్యమాలను అవమానపరుస్తూ మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా..? అని ప్రశ్నించారు.