హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్ కుమార్, ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపుల వివాదాలపై సమాధానం చెప్పాలని, వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్రం పిటిషన్లపై బుధవారం చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ విచారించింది. చిత్తూరు అదనపు ఎస్పీ అభిషేక్ మహంతికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఒక్కో అధికారి ఒక్కో న్యాయమేంటని ప్రశ్నించింది. అయితే, మిగతా పిటిషన్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ వద్ద పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్రెడ్డి సీజే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభిషేక్ మహంతి కేటాయింపు వివాదంపై కేంద్రం వేసిన పిటిషన్నూ జస్టిస్ భూయాన్ బెంచ్కే సీజే పంపించారు. ఆ పిటిషన్ను పరిశీలించిన బెంచ్.. అభిషేక్ మహంతితో పాటు ఐఏఎస్ల కేటాయింపులపై కౌంటర్లు వేయాలని సర్కార్ను ఆదేశించి, విచారణను మార్చి 24కి వాయిదా వేసింది.
ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమా?
- హైదరాబాద్
- February 24, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ రంజిత్ రెడ్డి
- హెచ్పీసీఎల్ లాభం 25శాతం డౌన్
- రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుంది: కపిలవాయి దిలీప్
- రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ ను గెలిపించాలి : దానం నాగేందర్
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు తగ్గిన పెట్టుబడులు
- హైదరాబాద్లో మూడ్రోజులు భారీ వర్షాలు
- కొత్త వీసీలకు కసరత్తు..మే 21తో ముగియనున్న వీసీల పదవీకాలం
- రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత
- మెగా డీఎస్సీకి 2.21 లక్షల అప్లికేషన్లు
- ఎప్ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురూ
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్