మోడీ ఫొటోలతో రాఖీలు..విృందావన్ వితంతువుల అభిమానం

మోడీ ఫొటోలతో రాఖీలు..విృందావన్ వితంతువుల అభిమానం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ రక్షా బంధన్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ మధురలోని విృందావన్‌లో నివసిస్తున్న వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి 75 త్రివర్ణ పతాకాలతో పాటు 501 రాఖీలను పంపుతున్నారు. ఇంతకుముందు రక్షా బంధన్ సందర్భంగా కొందరు వితంతువులు ప్రధాని నివాసానికి వెళ్లి రాఖీ కట్టేవారు. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా ప్రధానికి రాఖీ కట్టేందుకు వెళ్లలేకపోయారు. 

ఈ నేపథ్యంలో విృందావన్ లోని ఆశ్రమాల్లో నివసిస్తున్న వితంతువులు నరేంద్ర మోదీ చిత్రాలతో కూడిన ప్రత్యేక రాఖీలతోపాటు 75 త్రివర్ణ పతాకాలను ప్రధానికి పంపుతున్నారు. విృందావన్‌లోని శారదా, రాధా తిలా ఆశ్రమాలలో నివసించే వితంతువులు మోడీకి కలర్ ఫోటోలతో కూడిన రాఖీలను తయారుచేశారని సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ తెలిపారు. వితంతువులు తయారు చేసిన ఈ రాఖీలను రెండు బుట్టల్లో అలంకరించి ఢిల్లీకి పంపారు. ఈ రాఖీలు ఇవాళ పీఎంవోకు చేరనున్నాయి.