వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య.. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఘటన

వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య.. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఘటన

కోల్​బెల్ట్, వెలుగు: ప్రతి రోజు వేధిస్తున్నాడని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శాంతినగర్​కు చెందిన ఎండీ మోహిన్(42)ను అతని భార్య హత్య చేసింది. వివరాలిలా ఉన్నాయి.. డ్రైవర్​గా పని చేసే మోహిన్, సుక్కల అవంతి పదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరి మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. అవంతి కోపంతో మోహిన్​ మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి టౌన్​ ఎస్సై గోపతి నరేశ్​ తెలిపారు.