భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

మెదక్(చిన్నశంకరంపేట), వెలుగు: భర్త మృతిని తట్టుకోలేకపోయిన భార్య స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన మహేశ్వరి(26)కి ఎనిమిదేళ్ల కింద అదే గ్రామానికి చెందిన రమేశ్​కు పెండ్లయ్యింది. ప్రస్తుతం వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. 15 రోజుల కింద అనారోగ్యంతో రమేశ్ మృతి చెందాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్వరి ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గ్రామంలోని పాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి నీటిపైకి తేలిన మృతదేహాన్ని అటుగా వెళ్లిన గ్రామస్తులు గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. మృతురాలి తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు.15 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో చిన్నారులు ఇద్దరూ
అనాథలయ్యారు.