లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త చనిపోవడంతో భార్య సూసైడ్

లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త చనిపోవడంతో భార్య సూసైడ్

కరీంనగర్: జమ్మికుంట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కి చెందిన బండ రేష్మ (26), ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన షబ్బీర్ కొన్నాళ్ల కింద ప్రేమవివాహం చేసుకున్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న షబ్బీర్ నాలుగు నెలల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో షబ్బీర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. షబ్బీర్ ఆత్మహత్యతో తీవ్ర మనస్థాపానికి గురైన రేష్మ.. అప్పటినుంచి ముబావంగా ఉంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోవడంతో.. రేష్మ భరించలేక అంబేద్కర్ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. మృతురాలి సోదరుడు గోపిచంద్‌ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.