భర్తకు కరోనా సోకిందని భార్య ఆత్మహత్య

భర్తకు కరోనా సోకిందని భార్య ఆత్మహత్య

మెదక్: భర్తకు కరోనా వైరస్ సోకిందని బాధతో భార్య ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం చౌట్లపల్లిలో గురువారం జరిగిందీ ఘటన. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన పోచయ్య అనే  వ్యక్తి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. టెస్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. భర్తకు కరోనా సోకినట్టు తెలియడంతో కలత చెందిన ఆయన భార్య లక్ష్మి (36) ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మృతురాలి అన్న నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.