రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య... ఆ మూడో వ్యక్తి ఎవరు..?

రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య... ఆ మూడో వ్యక్తి ఎవరు..?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది. రాయితో తల పగలకొట్టి భర్తను దారుణంగా చంపేసింది భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. మరో వ్యక్తితో కలిసి భర్త రాకేష్ కుమార్ ను హత్య చేసింది భార్య పూనమ్ దేవి. మృతదేహాన్ని బావి పక్కన పడేసి.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యింది పూనమ్ దేవి. అజీజ్‌నగర్‌కు చెందిన రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌లో జరిగింది ఈ ఘటన.

రెండు నెలల క్రితం రాజిరెడ్డి ఫామ్ హౌస్ లో కూలీలుగా చేరారు రాకేష్, పూనమ్ దేవి దంపతులు.ఆగస్టు 21న రాకేష్ దంపతులతో పాటు మరో వ్యక్తి కనిపించాడని తెలుస్తోంది. తర్వాతి రోజు రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని అడిగాడు యజమాని రాజిరెడ్డి. మద్యం తాగొచ్చి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని బుకాయించింది భార్య.  రాకేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఏజెంట్‌కు ఫోన్ చేశాడు యజమాని రాజిరెడ్డి.

పూనమ్ దేవి, మహేశ్ సాని అనే వ్యక్తి కలిసి రాకేష్‌ను చంపి బావి వద్ద పడేశారని యజమానితో చెప్పాడు ఏజెంట్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు యజమాని రాజిరెడ్డి. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రాయితో రాకేష్ తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు పోలీసులు. రాకేష్ దంపతులతో కన్పించిన ఆ మూడో వ్యక్తి ఎవరు..? హత్యతో అతనికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.