కొత్త ట్రాక్టర్ కు పూజ చేయించేందుకు వెళ్తూ..

కొత్త ట్రాక్టర్ కు పూజ చేయించేందుకు వెళ్తూ..
  • ట్రాక్టర్ కింద పడి భార్య మృతి.. స్వల్ప గాయాలతో బయటపడ్డ భర్త
  • గన్నేరువరం మండలం పారువెళ్ల గ్రామం వద్ద ఘటన

కరీంనగర్: కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసి దేవాలయంలో పూజ చేయడానికి ట్రాక్టర్ పై  బయలుదేరి వెళ్లిన దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడి భార్య మృతి చెందగా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన గన్నేరువరం మండలంలోని పారువెళ్ల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన దురుముట్ల మల్లేశం ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసాడు. ఆదివారం  పారువేల్ల గ్రామంలోని లక్ష్మీ గణపతి ఈ దేవాలయంలో పూజలు నిర్వహించడానికి మల్లేశం భార్య  సరవ్వ  ట్రాక్టర్ పై  బయలుదేరారు. పారువెళ్ల గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న  ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా  పడింది. ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన సరవ్వ {34 } తీవ్రంగా గాయపడగా ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే సరవ్వ మృతి చెందింది. ఆమె భర్త మల్లేశంకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.