
ఈ మధ్య భర్తలను చంపుతున్న మహా పతివ్రతలు ఎక్కువవుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని చంపే వారు కొందరైతే..ఆస్తుల విషయం చిన్న చిన్న మనస్పర్థలతో మరికొందరు భర్తలను చంపుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ వనస్థలిపురంలో భర్తను చంపి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది ఓ మహా ఇల్లాలు.
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో మే 27న దారుణం జరిగింది. భర్తను చంపి ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. పోలీసుల వివరాల ప్రకారం.. 8 సంవత్సరాల క్రితం శిరీషను కులాంతర వివాహం చేసుకున్నాడు మృతుడు కిషన్ నాయక్. నారాయణపురానికి చెందిన కిషన్ నాయక్ కు, శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త కిషన్ నాయక్ ను వదిలి వనస్థలిపురం హిల్స్ కాలనీలో ఒంటరిగా ఉంటుంది శిరీష.
దీంతో ఎలాగైన భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న భార్య శిరీష పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచింది. అక్కడ కిషన్ ను గోడకు నెట్టేసింది.దీంతో తీవ్ర గాయాలై కింద పడిపోయిన భర్త కిషన్ ను చున్నీతో ఉరివేసి హత్య చేసింది భార్య శిరీష. కిషన్ నాయక్ కూతురు బిందు ఫిర్యాదుతో ఈహత్య ఉదంతం బయటపడింది. శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.