భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

భర్త వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. అంబర్ పేటకు చెందిన సుకీత్, కార్వాన్ కు చెందిన శివాని ఐదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. సుకీత్ మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. భార్య శివానిని వేధించడం మొదలుపెట్టాడు. ఆరు నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు శివాని తన కుటుంబ సభ్యలకు చెప్పింది. నువ్వు చనిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటా అంటూ సుకీత్ భార్యను అదేపనిగా వేధించడంతో జీవితంపై విరక్తి చెందిన శివాని నిన్న(శుక్రవారం) రాత్రి ఉరేసుకుంది. శివాని చనిపోయిన విషయాన్ని సుకీత్ కుటుంబ సభ్యలు ఆమె కుటుంబ సభ్యలకు తెలియచేశారు.

భర్త వేధింపులతోనే శివాని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోవడానికి ముందు శివాని.. తనతో మాట్లాడిందని ఆమె సోదరితో పోలీసులకు తెలిపింది. అంతేకాదు కొత్త చీర కొనేందుకు షాపింగ్ కు వెళ్తున్నాని కూడా చెప్పిందన్నారు. ఫోన్ చేసి పెట్టేసిన గంటసేపటికే సుకీత్ ఇంటి నుంచి శివాని చనిపోయినట్లు పోన్ వచ్చిందని ఆమె కుటుంబీకులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు….శివాని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి కప్పు ఎత్తు తక్కువగా ఉండటంతో అది ఉరేసుకోవడానికి అనువుగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ఇది హత్య అయివుండవచ్చని అనుమానిస్తున్నారు.ఆ కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.