కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

యాదగిరిగుట్ట, వెలుగు: ఫ్లాట్​అమ్మే విషయంలో గొడవ పడి కొడుకుతో కలిసి భర్తను చంపేసింది ఓ భార్య.  యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం కేకే తండాకు చెందిన ఆడోతు బాలునాయక్(45), పద్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అప్పులు తీర్చేందుకు భువనగిరిలోని ఫ్లాట్ అమ్ముదామని బాలు భార్య, పిల్లలతో చెప్పాడు. పద్మ, పెద్దకొడుకు నవీన్(19) ​అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో గురువారం గొడవ జరిగింది. అర్ధరాత్రి నిద్రపోతున్న బాలుపై పద్మ, నవీన్​గడ్డపారతో దాడి చేయడంతోఅక్కడికక్కడే మృతి చెందాడు.