బైపోల్ లో 30 వేల మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్

బైపోల్ లో 30 వేల మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజారిటీతో గెలుస్తుందన్నారు పీీసీసీీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్..సీనియర్ నేత జానారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. జానా రెడ్డితో కలిసి హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారం మొదలు పెట్టారు ఉత్తమ్.  ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆంధ్రాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి పని కాంగ్రెస్ హయాంలో జరిగిందేనన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ కి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు ఉత్తమ్.