బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్త: కంగనా రనౌత్‌‌‌‌

బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్త: కంగనా రనౌత్‌‌‌‌

పొలిటికల్‌‌‌‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ టికెట్‌ ఇస్తే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. 

న్యూఢిల్లీ: బాలీవుడ్‌‌‌‌ నటి కంగనా రనౌత్‌‌‌‌ తన పొలిటికల్‌‌‌‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంచేశారు. శనివారం హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీజేపీ టికెట్‌‌‌‌ ఇస్తే హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని మండి నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే వారెవరైనా రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. హిమాచల్‌‌‌‌ ప్రదేశ్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం ఇస్తే చాలా బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కంగనా ప్రశంసలు కురిపించారు. మోడీ మహాపురుష్‌‌‌‌ అంటూ వ్యాఖ్యానించారు. మోడీకి రాహుల్‌‌‌‌ గాంధీ ప్రత్యర్థి కావడం విచారకరమన్నారు. అయితే, తనకు ప్రత్యర్థులు లేరని మోడీకి తెలుసన్నారు. ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ ఇచ్చే తప్పుడు హామీలను హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ ప్రజలు నమ్మరని చెప్పారు. హిమాచల్ ప్రజలకు సొంత సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌ సిస్టం ఉందని, దీని ద్వారా వారు కూరగాయలు పండిస్తున్నారన్నారు. ఆప్‌‌‌‌ ఇచ్చే ఉచిత హామీలు ఇక్కడ పనిచేయవని కంగనా కొట్టిపారేశారు.