నవంబర్ 28 సాయంత్రం నుంచి వైన్​షాప్​లు బంద్

నవంబర్ 28 సాయంత్రం నుంచి  వైన్​షాప్​లు బంద్

​హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండటంతో మద్యం షాపులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటల నుంచి 30 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అన్నీ మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించింది. 

ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అక్రమ మద్యంపై నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో 1279 మద్యం దుకాణాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఇప్పటి వరకు రూ. 115.71 కోట్లకు పైగా అక్రమ మద్యం, డ్రగ్స్ సీజ్ చేసినట్టు పేర్కొంది.