బేగంపేటలో ముగిసిన ఏవియేషన్ షో

బేగంపేటలో ముగిసిన ఏవియేషన్  షో

హైదరాబాద్​, వెలుగు: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో వింగ్స్​ ఇండియా ఎక్స్​పో ఆదివారంతో ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. దీంతో  స్టాల్స్​లో సందర్శకులు తాకిడి కనిపించింది.  రెండు రోజుల్లో లక్షకు పైగా విజటర్స్ హాజరైనట్లు అంచనా. 

సండే రోజు 50 వేల మందికి  పైగా వచ్చారని నిర్వాహకులు తెలిపారు. వెహికల్ పార్కింగ్​ వేరే చోట ఏర్పాటు చేయడంతో  వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగిన  ఏవియేషన్​ షోలో106 దేశాలకు చెందిన 25 ఫ్లైట్లను  ప్రదర్శనలో ఉంచారు. 5 వేల మంది బిజినెస్ ​విజిటర్స్​, 113 మంది ఎగ్జిబిటర్స్, 1500 డెలిగేట్స్​   పాల్గొన్నారు.