
హైదరాబాద్, వెలుగు: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఎక్స్పో ఆదివారంతో ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. దీంతో స్టాల్స్లో సందర్శకులు తాకిడి కనిపించింది. రెండు రోజుల్లో లక్షకు పైగా విజటర్స్ హాజరైనట్లు అంచనా.
సండే రోజు 50 వేల మందికి పైగా వచ్చారని నిర్వాహకులు తెలిపారు. వెహికల్ పార్కింగ్ వేరే చోట ఏర్పాటు చేయడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఏవియేషన్ షోలో106 దేశాలకు చెందిన 25 ఫ్లైట్లను ప్రదర్శనలో ఉంచారు. 5 వేల మంది బిజినెస్ విజిటర్స్, 113 మంది ఎగ్జిబిటర్స్, 1500 డెలిగేట్స్ పాల్గొన్నారు.