హైదరాబాద్ : ఎంఎంసీలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ : ఎంఎంసీలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ పరిధిలో 13 అక్రమ నిర్మాణాలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఉప్పల్, కాప్రా, ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గదులు, షెడ్లు, అదనపు అంతస్తులను తొలగించారు. 

ఉప్పల్ సర్కిల్- పరిధిలోని ప్రశాంతినగర్ కాలనీలో స్టిల్ట్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన అక్రమ గదులు, రోడ్డువైపు విస్తరించిన బాల్కనీని తొలగించారు. రాంపల్లిలో కమర్షియల్​షెడ్‌‌‌‌‌‌‌‌, మేడిపల్లిలో పెంట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌, గాయత్రి హిల్స్‌‌‌‌‌‌‌‌లో అక్రమ షెడ్‌‌‌‌‌‌‌‌ తొలగించారు. కాప్రా ఏఎస్‌‌‌‌‌‌‌‌రావునగర్‌‌‌‌‌‌‌‌లో స్టిల్ట్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన గదులను కూలగొట్టారు. ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్ జోన్‌‌‌‌‌‌‌‌లోని లలితానగర్, గడ్డిఅన్నారం, మైత్రీనగర్​ప్రాంతాల్లోనూ అక్రమంగా నిర్మించిన 3, 4వ అంతస్తులు, స్టిల్ట్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌లోని గదులను తొలగించారు.