యాదాద్రి, వెలుగు : రెండేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు వెలువరిచింది. వివరాల్లోకి వెళ్తే.. 2021 అక్టోబర్ 31న తుర్కపల్లి మండలానికి చెందిన రెండండ్ల బాలిక పక్కింటికి వెళ్లింది. ఆ బాలికపై యువకుడు ధీరావత్ నవీన్ లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తల్లి విషయం గమనించి కూతురును ప్రశ్నించి లైంగిక దాడి జరిగిన విషయం తెలుసుకుంది. మరుసటి రోజు తుర్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు సాక్షాలు సేకరించి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. అన్ని పరిశీలించిన స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు నిందితుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
