మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇండ్లు

మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇండ్లు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్‌‌ కుటుంబానికి  ఎట్టకేలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కాయి. ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఆర్డర్స్ జారీ చేశారు. అనంతరం మోతె మండలం సిరికొండకు వెళ్లి మల్సూర్‌‌ కోడళ్లు పుష్పలత, యశోదలకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.

మల్సూర్ కుటుంబ సభ్యుల పరిస్థితులను పరిశీలించిన అనంతరం అర్హతల మేరకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం సిరికొండలోని అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి, రిపేర్ల కోసం రూ. 3 లక్షలు కేటాయించారు. కార్యక్రమంలో మోతె తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో సందీప్ కుమార్, హౌసింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ అబ్దుల్లా పాల్గొన్నారు.